ధారూరు, జూన్ 10: పల్లెలు ఆదర్శ గ్రామాలుగా రూపుదిద్దుకోవాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపడుతున్నది. పల్లె ప్రగతితో మండలంలోని కెరెళ్లి గ్రామ రూపురేఖలు మారాయి. ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధిలో దూసుకుపోతున్నది. గ్రామంలో విస్తృతంగా పరిశుభ్రత, పచ్చదనం కార్యక్రమాలు చేపట్టడంతో అభివృద్ధి దిశలో పయనిస్తున్నది. గ్రామ ముఖద్వారం నుంచే రోడ్డుకు ఇరువైపులా హరిత హారం మొక్కలు పచ్చందాలతో స్వాగతం పలుకుతున్నాయి. ప్రతి వీధిలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించారు. ఆహ్లాదకరమైన పల్లె ప్రకృతి వనం, నర్సరీ, పంచాయతీ భవనం, డంపింగ్ యార్డు, వైకుంఠధామం, కంపోస్టుషెడ్, రైతు వేదిక గ్రామానికి అందాన్ని తెచ్చాయి. మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్నారు. మురుగుదొడ్డి, ఇంకుడుగుంతలతో గ్రామం పరిశుభ్రంగా మారింది.
పల్లె ప్రగతిలో అభివృద్ధి
పల్లె ప్రగతిలో భాగంగా గ్రామంలో రూ.11.86 లక్షలతో వైకుంఠధామం, రూ.2.5 లక్షలతో కంపోస్టు షెడ్డు, రూ.22 లక్షలతో రైతు వేదిక, నర్సరి, రైతుల కోసం కల్లాల నిర్మించారు. పంచాయతీ నిధులతో కొన్న ట్రాక్టర్తో ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించి, పల్లె ప్రగతిలో భాగంగా ఏర్పాటుచేసిన డంపింగ్యార్డులో వేస్తున్నారు. ఇంటింటికీ రెండు చెత్త బుట్టలు పంపిణీ చేశారు. ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేసి కొత్త వెలుగులు తీసుకొచ్చారు.
పల్లె ప్రకృతి వనం, నర్సరీ
పల్లె ప్రకృతి వనంలో 1500 మొక్కలు నాటారు. వాకింగ్ చేయడానికి రోడ్డు వేశారు. ప్రతిరోజూ మొక్కలకు నీరు పోసి వాటిని రక్షించుకుంటున్నారు. నర్సరీలో టేకు, తుల సి, జామ, టైకోమా, జీడి, నిమ్మ, ఖర్జూర, ఉసిరి తదితర మొత్తం 11వేల మొక్కలు పెంచుతున్నారు.
రైతు వేదిక
గ్రామంలో రైతుల సమస్యలు తక్షణమే పరిష్కరించేందుకు క్లస్టర్ స్థాయిలో రైతు వేదికను ఏర్పాటు చేశారు. రూ.22 లక్షల వ్యయంతో దీన్ని నిర్మించారు. ఇందులో వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉండేలా ఏర్పాటుచేశారు. కెరెళ్లి క్లస్టర్ పరిధిలో కెరెళ్లి, ఎబ్బనూర్, అల్లీపూర్, హరిదాస్పల్లి, చింతకుంట పంచాయతీలు ఉ న్నాయి. ఇందులో సమావేశాలు ఏర్పా టు చేసి సమస్యలు, సలహాలు, సూచనలను వ్యవసాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకునే సౌకర్యం కల్పించారు.
అభివృద్ధే ప్రధాన లక్ష్యం
గ్రామ అభివృద్ధే ప్రధాన ఎజెండా గా ముందుకు సాగుతున్నాం. రాజకీయాలకతీతంగా సమన్వయంతో ముందుకెళ్లి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేశాం. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మండలంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం.
పల్లె ప్రగతి విజయవంతం
గ్రామస్తుల సహకారంతో పల్లె ప్రగతి విజయవంతమైంది. సర్పం చ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, టెక్నికల్ అసిస్టెంట్, గ్రామస్తుల సహకారంతోనే అభివృద్ధి జరిగింది. గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రతకు అధిక ప్రాధానత్యను ఇస్తున్నాం.
పల్లె ప్రగతితో అభివృద్ధి
గ్రామంలోని ప్రతిఒక్కరి సహకారంతో అభివృద్ధి జరిగింది. 30 రో జుల ప్రణాళికతో ప్రారంభమై గ్రా మంలో అభివృద్ధికి బాటలుపడ్డాయి. సర్పంచ్, గ్రామస్తులు, వార్డు సభ్యులు, అధికారుల సమిష్టి కృషితోనే అన్ని రంగాల్లో గ్రామం దూసుకుపోతున్నది.