షాద్నగర్టౌన్ జూన్ 10 : వాన కాలం నేపథ్యంలో క్లస్టర్లలో నిర్మించిన రైతు వేదికల్లోనే వ్యవసాయ విస్తరణ అధికారులు విధులు నిర్వహిస్తారని మండల వ్యవసాయ అధికారి నిశాంత్కుమార్ గురువారం తెలిపారు. ఇందులో భాగంగానే సర్కార్ ఆదేశాల మేరకు ఇక నుంచి రైతు వేదికల్లో రైతులకు వ్యవసాయ విస్తరణ అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. వ్యవసాయశాఖ, రైతులకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు వేదికలోనే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫరూఖ్నగర్ మండలంలోని ఎలికట్ట, కొండన్నగూడ, మధురాపూర్ బూర్గుల, చించోడ్ గ్రామాల్లోని రైతు వేదికల వద్ద అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. రైతులు అధికారులను సంప్రదించి సాగు వివరాలు తెలుసుకునే విధంగా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని సూచించారు.