మోమిన్పేట, మే 8 : భూగర్భ జలాలు పెంపొందించాలని.. పరిసర ప్రాంతాల్లోని భూములకు సాగు నీరు అందించాలన్న లక్ష్యంతో 100 సంవత్సరాల ముందే మండల పరిధిలో నీటి నిల్వలకు చెక్డ్యాంలు ఏర్పాటు చేశారు. మోమిన్పేట నుంచి మండల పరిధిలోని రాళ్లగుడుపల్లి, మేకవనంపల్లి పైనుంచి ప్రవహించే పెద్దవాగు వాగుపై 1904లో చెక్డ్యాంను నిర్మించారు. పెద్దవాగు నుంచి వృథాగా పారే నీటికి అడ్డుకట్టవేసి సంగారెడ్డి జిల్లా అనంతసాగర్ గ్రామాల దగ్గరలో ఉన్న చెరువులోకి నీరు తరలించేలా కాలువలు ఏర్పాటు చేశారు. నాణ్యతతో పనులు చేయడంతో నేటికీ ఈ కట్టడాలు చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఈ డ్యాం ద్వారా పంట పొలాలకు నీరందించేందకు తూములు ఏర్పాటు చేసి నీటి పారుదలకు అనుకూలంగా మలిచారు. రాళ్లగుడుపల్లి, మిట్యానాయక్తండా, మేకవనంపల్లి, అనంత్సాగర్ గ్రామాల రైతులు ఈ నీటి అధారంగానే ఖరీఫ్, రబీ పంటలు సాగుచేస్తున్నారు.