శంకర్పల్లి, జూలై 26 : సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు సమన్వయంగా గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలని ఎంపీపీ గోవర్ధన్రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిషత్ సమావేశ మందిరంలో మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గత వారంలో నిర్వహించిన పల్లె ప్రగతిలో సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, వార్డు సభ్యులు చిత్తశుద్ధితో పనులు చేపట్టి గ్రామాలను అందంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దారని కొనియాడారు. కలెక్టర్ కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారని ఈ సందర్భంగా చెప్పారు. రైతులకు వెంచర్ల యజమానులతో ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఆదేశించారు. పొలాలకు వెళ్లేలా దారి కల్పించాలన్నారు. మండలంలోని బుల్కాపురం నుంచి జనవాడ గ్రామం వరకు గల ఫిరంగి నాల హద్దులను ఇరిగేషన్ శాఖ అధికారులు ఖరారు చేయాలన్నారు.
పలు అంశాలపై చర్చ..
సమావేశంలో పలు అంశాలపై చర్చలు జరిగాయి. మండలంలో 19,030 రైతులకు రైతు బంధు అందిందని వ్యవసాయాధికారి కృష్ణవేణి తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గోవిందమ్మ, వైస్ ఎంపీపీ రాములమ్మ, శంకర్పల్లి ఏఎంసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, ఎంఈవో అక్బర్, ఎంపీవో గీత, పీఆర్డీఈ జగన్రెడ్డి, ఇరిగేషన్ శాఖ డీఈ ఉషారాణి, ఎంఆర్ఐ ఖాజామొయినుద్దీన్, డీటీ సతీష్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ప్రహరీ కూల్చడం అన్యాయం
శంకర్పల్లి మండలం ప్రొద్దటూరు శివారులో హైదరాబాద్కు చెందిన ఓ ఆసామి ప్రహరీని అధికారులు కూల్చి వేయడం అన్యాయమని సర్పం చ్ నర్సింహారెడ్డి అన్నారు. ఎంపీవో గీత మాట్లాడుతూ 111 జీవోలో అక్రమంగా నిర్మాణాలు జరిగాయని ఫిర్యాదు చేస్తే కూల్చి వేస్తామని సభలో తెలిపారు.