కులకచర్ల, జూన్ 29 : పల్లె ప్రగతి ద్వారా మక్తవెంకటాపూర్ గ్రామం అభివృద్ధిలో పోటీ పడుతుంది. మురుగునీటికాల్వల ఏర్పాటు, పల్లె ప్రకృతి వనం, కల్లాలు, వివిధ రకాల షెడ్లు, డంపింగ్యార్డు, వైకుంఠధామం నిర్మాణాలు, హరితహారం ద్వారా నర్సరీల ఏర్పాటు చేసి మొక్కలు నాటడంతో పాటు ప్రభుత్వం వివిధ రకాల పనులు నిర్వహించేందుకు ప్రత్యేకించి గ్రామ పంచాయతీలకు నిధులు పెద్ద ఎత్తున కేటాయిస్తుండటంతో మక్తవెంకటాపూర్ అభివృద్ధిలో పరుగులు తీస్తున్నది. ఇంటింటికి నల్లాతో తాగునీటి సౌకర్యం, 100శాతం మరుగుదొడ్ల నిర్మాణం, సీసీ రోడ్ల ఏర్పాటుతో స్వచ్ఛత గ్రామంగా దర్శనమిస్తున్నది.
ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీరు…
గ్రామంలో ప్రతి రోజు చెత్తను సేకరించి గ్రామాన్ని అన్ని విధాలుగా పరిశుభ్రంగా ఉంచేందుకు గ్రామ పంచాయతీ కార్మికులను నియమించింది. ప్రతి రోజూ ట్రాక్టర్ ద్వారా చెత్తను సేకరించి డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. ప్రతి ఇంటికీ రెండు చెత్త బుట్టలను గ్రామ పంచాయతీ ద్వారా అందజేశారు. గ్రామస్తులు తప్పని సరిగా తడి, పొడి చెత్తను వేరు చేసి ట్రాక్టర్లో వేయాలని సూచించారు.
పూర్తైన వైకుంఠధామం..
మక్తవెంకటాపూర్ వైకుంఠధామం నిర్మాణం పూర్తైంది. ప్రభుత్వం సూచించిన ప్రకారం అన్ని విధాలుగా నిర్మించారు. చుట్టూ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు.
అండర్డ్రైనేజీ పనులు ప్రారంభం..
గ్రామంలో అండర్ డ్రైనేజీ పనుల నిర్వహిస్తున్నారు. గ్రామంలో సర్పంచ్ అనిత, జడ్పీటీసీ రాందాస్, ఎంపీటీసీ చిలుకల సత్యమ్మ ఆధ్వర్యలో అండర్ డ్రైనేజీ పనులు ప్రారంభించారు. పారిశుద్ధ్య గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక ప్రకారం కృషిచేస్తున్నారు.
అవెన్యూప్లాంటేషన్…
గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ చేశారు. మొక్కలను నాటి వాటికి ట్రీగార్డులను ఏర్పాటు చేశారు.
ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్నాం..
గ్రామాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళుతున్నాం. గ్రామ పంచాయతీ పరిధిలో వివిద్ధి అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నాం. జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామంలోని అన్ని పార్టీల సహకారంతో మరింత అభివృద్ధి చేస్తున్నాం. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను గ్రామాభివృద్ధి కార్యక్రమానికి కేటాయించాం. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దుతాం.
భారీగా నిధులను కేటాయిస్తుంది..
ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు భారీగా నిధులను కేటాయిస్తుంది. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, నీటి సరఫరా చేసేందుకు ట్యాంకర్, పల్లె ప్రకృతివనాల నిర్వహణ, ప్రతి గ్రామానికి ఒక నర్సరీ, గ్రామ పంచాయతీ సిబ్బంది నియమించగా, గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషిచేస్తున్నది.