పరిగి, జూన్ 20: పల్లెలు, పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దడంతోపాటు సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై జిల్లాస్థాయి ఉన్నతాధికారులు పర్యవేక్షణ మరింత పకడ్బందీగా చేపడుతున్నారు. ఇందుకు సంబంధించి ఆయా గ్రామాల్లో వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందు కు స్వయంగా కలెక్టర్, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు రోజువారీగా పర్యటనలు చేపడుతున్నారు. మండల స్థాయిలో మండల పంచాయతీ అధికారులు ప్రతిరోజు పల్లె ప్రగతి కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి పర్యవేక్షిస్తున్నారు.
ఉన్నతాధికారుల స్వీయ పర్యవేక్షణలో..
వికారాబాద్ జిల్లాలో 4 మున్సిపాలిటీలు, 565 పంచాయతీలు ఉన్నాయి. వాటిలో చేపట్టిన పల్లె, పట్టణ ప్రగ తి కార్యక్రమాలకు సంబంధించిన పనులను స్వయం గా ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. పల్లెలు, పట్టణాల్లో ఏదైనా సమస్యలుంటే వెంటనే పరిష్కరిస్తున్నా రు. ఇటీవల జిల్లాల అదనపు కలెక్టర్లు(స్థానిక సంస్థ లు), జిల్లా పంచాయతీ అధికారులతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించి, పల్లె, పట్ట ణ ప్రగతి కార్యక్రమాలపై చర్చించారు. ప్రతి గ్రామ పం చాయతీకి, మున్సిపాలిటీలకు ప్రతినెలా నిధు లు విడుదల చేస్తున్నారు. ఈ నిధులతో గ్రామాలు, పట్టణా ల్లో అభివృద్ధిపై స్పష్టమైన మార్పు కనిపించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా మండల అధికారి నుంచి జిల్లా అదనపు కలెక్టర్ వరకు నిత్యం అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్నారు. దీనికోసం అధికారులు 20 అంశాలతో కూడిన చార్ట్ను రూపొందించారు.
గ్రామాల్లో వేగంగా అభివృద్ధి పనులు
రెండేండ్లుగా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో చేపట్టిన పనులను జిల్లాస్థాయి ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆయా గ్రామాలు, మున్సిపాలిటీల్లో చేపట్టిన పనులను స్వయంగా తెలుసుకోవడం కోసం కలెక్టర్ పౌసుమిబసు కూడా గ్రామాల్లో పర్యటిస్తున్నా రు. స్థానిక సమస్యలు, ప్రగతి పనులపై పూర్తిస్థాయి అవగాహన ఉండాలని, అందుకు జిల్లా అదనపు కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా వాహనాలు అందజేశారు. ప్రత్యేకంగా రూ.25 లక్షలు నిధులు కేటాయించారు. దీంతో కలెక్టర్, అదనపు కలెక్టర్తోపాటు ఆయా మండలాల్లో జిల్లా స్థాయి ఉన్నతాధికారులు పల్లె, పట్టణ ప్రగతిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ఎక్కడైనా పనుల్లో వేగం మందగిస్తే సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
పారిశుద్ధ్యం, పచ్చదనంపై ప్రధాన దృష్టి
పల్లెలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం, పచ్చదనంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. పారిశుద్ధ్య పనులు నిత్యం చేపట్టాలని, వానకాలంలో వర ద నీరు వెళ్లడానికి నాలాల్లోని సిల్ట్ను తొలగించాలని సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. మురుగు కాల్వ ల్లో పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించేలా చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల్లోని నర్సరీ ల్లో మొక్కల పెంపకాన్ని స్వయంగా పరిశీలిస్తున్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటేలా చర్య లు చేపట్టాలని, ప్రతి ఇం టికి మొక్కలు అందజేయాలని నిర్ణయించారు. జిల్లాలోని 565 పంచాయతీల్లో ఉన్న నర్సరీల్లో ఒక్కోదాని లో సుమారు పదివేల మొ క్కలు పెంచుతున్నారు. దీం తో ఈసారి హరితహారం లో భారీగా మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఏరోజుకు ఆరోజు అభివృద్ధి పనులపై మం డల పంచాయతీ అధికారిని అడిగి తెలుసుకుంటున్నా రు. వైకుంఠధామాల నిర్మా ణం, డంపింగ్యార్డులు, పల్లె ప్రకృతివనాల్లో మొక్కల పెంపకం, ఇంటింటి నుంచి చెత్త సేకరణ తదితర అంశాలపై ఉన్నతాధికారులు రోజువారీగా సమాచారాన్ని సేకరిస్తున్నారు.