బంట్వారం, నవంబర్ 24: తరతరాలుగా సాగు చేస్తున్న రైతు లకు పోడు భూముల పట్టాల పంపిణీకి చర్యలు తీసుకుంటు న్నట్లు తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని రొంపల్లి గ్రామంలో పోడు భూముల సాగుపై గ్రామ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ, అటవీ ప్రాంతంలో సుమారు 75 యేండ్లుగా సాగు చేస్తున్న రైతులను గుర్తిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి రైతులు తమ వద్ద ఏమైనా రికార్డులు ఉంటే అం దజేయాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఉమాదేవి, వార్డు సభ్యులు, ఇతర నాయకులు చందుసింగ్, పంచాయతీ కార్యదర్శి వెంకట్రెడ్డి పాల్గొన్నారు.
ఊటుపల్లి గ్రామంలో
దోమ, నవంబర్24: అర్హత కలిగిన రైతులందరికీ పోడు భూ ముల పట్టాలు ఇచ్చే దిశగా కృషి చేస్తున్నామని తహసీల్దార్ షాహెదాబేగం అన్నారు. దోమ మండల పరిధిలోని ఊటుపల్లి గ్రామంలో గురువారం సర్పంచ్ నర్సింహులు, పోడు భూము ల కమిటీ సమక్షంలో రైతులతో తహసీల్దార్ గ్రామ సభను నిర్వహించారు. గ్రామంలో పోడు భూములు సాగు చేస్తున్న అర్హత గల 30 మంది రైతులను ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు తెలిపారు. కార్యక్రమంలో పోడు భూముల కమిటీ చైర్మన్ నారాయణ, ఆర్ఐ లింగం పాల్గొన్నారు.
పటేల్చెరువుతండాలో …
కులకచర్ల, నవంబర్ 24 : కులకచర్ల మండల పరిధిలోని పటే ల్చెరువుతండా గ్రామ పంచాయతీలో గురువారం పోడు భూములపై గ్రామ సభ సర్పంచ్ శాంతిబాయి ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశంలో ఎంపీడీవో నాగవేణి మాట్లా డుతూ పోడుభూముల రైతులకు న్యాయం చేసేందుకు ప్ర భుత్వం పంచాయతీరాజ్, రెవెన్యూ అటవీశాఖల ఆధ్వర్యంలో చర్యలు చేపట్టిందని తెలిపారు. అర్హులైన పోడుభూముల రైతు ల వివరాలు జిల్లా అధికారులకు పంపించనున్నట్లు తెలిపారు. సమావేశంలో వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, పోడుభూముల రైతులు, నాయకులు పాల్గొన్నారు.