కడ్తాల్/తలకొండపల్లి , జూన్ 7: అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఏక్వాయిపల్లి గ్రామానికి చెందిన మల్లమ్మకి రూ.60 వేలు, కడ్తాల్కి చెందిన ఆసియాబేగంకు రూ.16 వేలు, తలకొండపల్లి మండలం చంద్రధనకి చెందిన శివకుమార్కు రూ.34వేలు, మాడ్గుల్ మండలం కలకొండకు చెందిన సుశీలమ్మకు రూ.16 వేలు మంజూరయ్యాయి. హైదరాబాద్లోని ఎమ్మెల్సీ నివాసంలో స్థానిక నాయకులతో సోమవారం లబ్ధిదారులకు ఎమ్మెల్సీ సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటున్నదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అనిత, మాజీ ఎంపీపీ బుగ్గయ్యగౌడ్, సర్పంచ్లు సరిరామ్నాయక్, పాండుగౌడ్, నాయకులు సురేందర్రెడ్డి, రాజేందర్రెడ్డి, లతీఫ్, విజయ్రాథోడ్ పాల్గొన్నారు.
అబ్దుల్లాపూర్మెట్లో..
అబ్దుల్లాపూర్మెట్, జూన్ 7 : ఆపదలో ఉన్న పేదలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తున్నదని లష్కర్గూడ ఎంపీటీసీ సాయికుమార్గౌడ్ అన్నారు. గ్రామానికి చెందిన కే.నరేశ్ రూ.60వేలు, సుర్మయిగూడకు చెందిన జ్యోతికి మంజూరైన రూ.56వేల చెక్కులను సోమవారం ఎంపీటీసీ లబ్ధిదారుల ఇంటికెళ్లి అందజేశారు. ఆర్థిక సాయం అందేలా కృషి చేసిన ఎమ్మెల్యే, ఎంపీటీసీకి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు శేఖర్, యాదయ్య, ఆర్కె లింగస్వామిగౌడ్, నవీన్గౌడ్ పాల్గొన్నారు.
తుర్కయాంజాల్లో..
తుర్కయాంజాల్, జూన్ 7 : ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరమని డీసీసీబీ వైస్ చైర్మన్ సత్తయ్య అన్నారు. మున్సిపాలిటీ పరిధి బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన ఓబుళాపురం కావ్యకు రూ.33 వేలు, యాంజాల్కు చెందిన బండారు రాజుకు రూ.56 వేలు చొప్పున మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను డీసీసీబీ వైస్ చైర్మన్ సత్తయ్య సోమవారం తుర్కయాంజాల్లోని తన నివాసంలో అందజేశారు. సీఎం కేసీఆర్తోనే పేదల అభ్యున్నతి సాధ్యమని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కల్యాణ్ నాయక్, తుర్కయాంజాల్ రైతు సేవా సహకార సంఘం డైరెక్టర్ సంజీవ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు విజయానంద్ రెడ్డి, ధన్రాజ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.