మొయినాబాద్ : మండల పరిధిలోని మేడిపల్లిలో ఒక గేదె రెండు దూడలకు జన్మనిచ్చింది. గ్రామానికి చెందిన నారాయణకు సంబంధించిన పాడి గేదె శనివారం రెండు గేదెలకు జన్మనిచ్చింది. రెండు దూడలకు గేదె జన్మనివ్వడంతో చూసిన వారు ఆశ్చర్యపోయారు. రెండు గేదెలు కూడా ఆరోగ్యంగా ఉన్నాయని మండల పశువైద్యాధికారి శ్రీలత తెలిపారు. పాడి గేదె సాధారణంగా ఒకే దూడకు జన్మనిస్తుందని, వంద గేదెల్లో ఒక గేదె మాత్రమే రెండు దూడలకు జన్మనిస్తుందని ఆమె పేర్కొన్నారు. పాడి గేదె రెండు దూడలకు జన్మనివ్వడంతో రైతు నారాయణ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.