షాబాద్ : రైతులు వేసిన పంటల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయించుకోవాలని ఏఈఓ లిఖిత అన్నారు. మంగళవారం షాబాద్ మండల పరిధిలోని బొబ్బిలిగామ గ్రామంలో రైతులు సాగుచేసిన పంట వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వానకాలంలో రైతులు సాగుచేసిన పంట వివరాలను సేకరించి ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుందన్నారు. రైతులు ఏ సర్వే నంబర్లో ఎంత విస్తీర్ణంలో ఏఏ పంటలు వేశారని పరిశీలించి వివరాలు తీసుకుంటున్నమని తెలిపారు. ఇప్పుడు తీసుకున్న వివరాల ఆధారంగానే పంట దిగుబడులు మార్కెట్లో అమ్ముకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. రైతులు ఈ ఆవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పంటల వివరాలు తమకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొన్నారు.