ఇబ్రహీంపట్నంరూరల్ : పేదలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలుస్తున్నారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఎలిమినేడు గ్రామానికి చెందిన హనుమంతు లక్ష్మయ్య అనే వ్యక్తి అనారోగ్యం భారీన పడి నగరంలోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. అతనికి వైద్యం కోసం పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమైనందున ప్రభుత్వ సహకారంతో వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 3లక్షలను ఎమ్మెల్యే విడుదల చేయించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల పాలిట ఆప ద్బాంధువుడిగా నిలిచాడని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కృపేష్, మండల తెరాస అధ్యక్షుడు చిలుకల బుగ్గరాములు, గ్రామశాఖ అధ్యక్షుడు దోమకొండ నర్సింహ, నాయకులు బుగ్గరాములు, వెంకయ్య, దేవరాజు పాల్గొన్నారు.