చేవెళ్ల టౌన్ : బీజేపీ దళిత వ్యతిరేకని, వారి అభివృద్ధిని ఆ పార్టీ నాయకులు ఓర్వలేకపోతు న్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆరోపించా రు. బీజేపీ నాయకులు కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడంతో జూరాబాద్లో దళిత బంధు నిధుల పంపిణీని ఈసీ నిలిపేసిందన్నారు. దళితబంధును బీజేపీ నాయకులు నిలిపివేయించడంతో టీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య ఆధ్వర్యంలో చేవెళ్ల నియోజకవర్గంలోని ఐదు మండలాల టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి మంగళవారం చేవెళ్ల మండల కేంద్రంలోని హైదరాబాద్ -బీజాపూర్ జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ డౌన్డౌన్ అంటూ నినాదాలు చేసి, ఆ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నదని కొనియాడారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దళితుల అభివృద్ధికి ఎలాంటి పథకాలను అమలు చేయడంలేదని విమర్శించారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు మర్పలి మాలతీకృష్ణా రెడ్డి, పట్నం అవినాశ్రెడ్డి, కాలే శ్రీకాంత్, కాలే జయ మ్మ, గోవిందమ్మ, ఎంపీపీలు మల్గారి విజయలక్ష్మీరమణారెడ్డి, కోట్ల ప్రశాంత్రెడ్డి, నక్షత్ర, కాలే భవాని, గోవర్ధన్రెడ్డి, మాజీ ఎంపీపీ బాల్రాజ్, మున్సిపల్ చైర్ పర్సన్ సాత విజయలక్ష్మి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు శివనీల, వైస్ చైర్మన్లు, వైస్ ఎంపీపీ శివప్రసాద్, ఆయా మండలాల పార్టీల అధ్యక్షులు ప్రభాకర్, నర్సింగ్రావు, మహేందర్రెడ్డి, నాగిరెడ్డి, గోపాల్, సర్పంచ్లు శివారెడ్డి, భీమాయ్య, అనిత, శ్రీనివాస్గౌడ్, రాజేందర్ గౌడ్ తదితరులు ఉన్నారు.
టీఆర్ఎస్లో పలువురి చేరిక
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. మంగళవారం చేవెళ్ల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాయంలో ఎమ్మెల్యే సమక్షంలో పామెన గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు నిరంజన్, విష్ణువర్ధన్రెడ్డి, వెంకటేశ్ టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల మన్ననలను పొందుతున్నారన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి, వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, మండల అధ్యక్షుడు ప్రభాకర్, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు శేరి శివారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి వెంకటేశ్, ఎంపీటీసీ సత్యనారాయణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ యాదగిరిగౌడ్, వినోద్ కుమార్, వార్డు సభ్యులు ఉన్నారు.