శంకర్పల్లి : ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు పాలనను చూసి చాలా మంది ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని చేవేళ్ల ఎమ్మెల్యె కాలె యాదయ్య అన్నారు. ఆదివారం కాంగ్రెస్కి చెందిన శంకర్పల్లి ఏఎంసీ మాజీ డైరెక్టర్ మాణిక్రెడ్డి చించల్ పేట్లోని ఎమ్మెల్యే స్వగృహంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను తారతమ్యాలు లేకుండా ఆదుకుంటున్నారని తెలిపారు. రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారికి ఆసరాగా నిలుస్తున్నారని చెప్పారు. టీ
ఆర్ఎస్లో చేరిన వారికి సముచిత స్థానం లభిస్తుందని అన్నారు. కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు గోపాల్, ఉపాధ్యక్షుడు రాఘవేందర్రెడ్డి, నాయకులు గోపాల్రెడ్డి, స్థానిక ఏఎంసీ డైరెక్టర్ శ్రీకాంత్ (జంగయ్య), నాయకులు పాల్గొన్నారు.