బొంరాస్పేట : గణేష్ మండపంలో నిర్వహించిన లడ్డు వేలం పాటలో ముస్లిం సర్పంచ్ పాల్గొని వేలం పాడి లడ్డును దక్కించుకున్నాడు. గణేష్ నిమజ్జనం సందర్భంగా గౌరారం గ్రామంలోని వినాయక మండపంలో సోమవారం రాత్రి నిర్వాహకులు లడ్డును వేలం వేశారు. ఈ వేలంలో గ్రామ సర్పంచ్, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు ఎండీ ఇసాక్ అలియాస్ చాంద్పాషా పాల్గొన్నారు. రూ. 12వేలకు వేలంలో లడ్డుని సొంతం చేసుకున్నాడు. అనంతరం నిర్వాహకులు లడ్డుని చాంద్పాషాకు అందజేశారు. ప్రజలందరూ కలిసి మెలిసి సోదర భావంతో మెలగాలన్నదే తన ఉద్దేశమని ఈ విషయాన్ని అందరికీ తెలియజేయడానికే లడ్డు వేలంలో పాల్గొన్నానని చాంద్పాషా తెలిపాడు. సర్పంచ్ను ప్రజలు అభినందించారు.