కొడంగల్, మే 30: కరోనా ఉధృతితో ప్రతిఒక్కరూ ఇబ్బందులకు గురికావాల్సి వస్తున్నదని లాక్డౌన్తోనే కరోనా కట్టడవుతున్నదని సీఐ అయ్యప్ప అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో పోలీసులు, వాహనదారులు, హోటల్ యజమానులకు ఆయన మాస్క్లు అందించి, కరోనాపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాను కట్టడి చేయాలంటే అందరూ విధిగా మాస్క్లు ధరించాలని, భౌతిక దూరం, పరిశుభ్రతలు పాటించాలని అన్నారు. లాక్డౌన్ సమయంలో గుంపులుగా కాకుండా ఒంటరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. లాక్డౌన్ విధించడం వల్ల కరోనాను సమర్థవంతంగా కట్టడి చేసుకోగలుగుతున్నామని, రోజురోజుకూ పాజిటివ్ కేసులు తగ్గుతున్నారన్నారు. ఇదే తరహాలో ప్రజలు లాక్డౌన్కు సహకరించి, వ్యాక్సినేషన్ వేయించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరుల పాల్గొన్నారు.
దౌల్తాబాద్లో..
దౌల్తాబాద్, మే 30: మండలంలో లాక్ డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నట్లు ఎస్ఐ విశ్వజన్ తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలో ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలుచేస్తున్న లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. మండల ప్రజలు ఇష్టారీతిగా వాహనాలతో రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తామన్నారు. ప్రతిఒక్కరూ మాస్క్లు ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు.