నందిగామ, జూన్ 25 : రాష్ట్రం ఏర్పడితే విద్యుత్ సంక్షోభం వచ్చి తెలంగాణ అంధకారంలో ఉండిపోవాల్సి వస్తుందని సమైక్య పాలకులు అసెంబ్లీ సాక్షిగా అన్నారని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. సమైక్య పాలకుల మాటలను పటాపంచలు చేస్త్తూ సీఎం కేసీఆర్ విద్యుత్ రంగంలో రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపారన్నారు. మండల పరిధిలోని చేగూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం సర్పంచ్ సంతోష ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ హాజరై జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్, ఎంపీపీ ప్రియాంకగౌడ్, విద్యుత్ అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం సబ్స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంటు ఇవ్వడంతో పాటు పరిశ్రమలకు 24 గంటలు కరెంటు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు.
లోవోల్టేజీ సమస్యకు చెక్..
గతంలో లోవోల్టేజీతో రైతుల బోరు మోటర్లు తరచూ కాలిపోయేవన్నారు. లోవోల్టేజీ సమస్య లేకుండా సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కొత్తూరు జడ్పీటీసీ శ్రీలత, ఎంపీపీ మధుసూదన్రెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ అశోక్, మాజీ చైర్మన్ విఠల్, వైస్ చైర్మన్ పద్మారావు, ఎస్సీ కమిషన్ సభ్యుడు రాంబాల్నాయక్, రాజేంద్రనగర్ సర్కిల్ ఎస్ఈ గోపయ్య, షాద్నగర్ డీఈ రాజారాంరెడ్డి, ఏడీఈ రవీందర్, నందిగామ, కోత్తూరు ఏఈ ఈశ్వర్, లక్ష్మణ్నాయక్, విద్యుత్ శాఖ సిబ్బంది, నాయకులు సత్యనారాయణ, దేవేందర్యాదవ్, వీరేందర్గౌడ్, భాస్కర్గౌడ్, సములయ్య, రాజు, శ్రీశైలం, శేఖర్ పాల్గొన్నారు.
మరో సబ్స్టేషన్ పనుల పరిశీలన..
చేగూరు గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న 220/132/33 కేవీ సబ్స్టేషన్ పనులను ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ శుక్రవారం విద్యుత్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. త్వరలో సబ్స్టేషన్ ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
అభివృద్ధే ప్రథమ లక్ష్యం
గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. మండలంలో శుక్రవారం ఆయా గ్రామాల్లో జడ్పీటీసీ శ్రీలత, సర్పంచ్ల ఆధ్వర్యంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మండల పరిధిలోని ఏనుగుల మడుగుతండాలో సర్పంచ్ అరుణరమేశ్ ఆధ్వర్యంలో నిర్మించనున్న అంగన్ వాడీ భవనం, ఇన్ముల్నర్వలో సర్పంచ్ అజయ్నాయక్ ఆధ్వర్యంలో డ్వాక్రా భవన నిర్మాణం, కిచెన్ షెడ్ నిర్మాణం, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కొడిచర్లతండా, ఖాజిగూడతండా, కొడిచర్ల, కొత్తూరు తండాలో, మల్లాపూర్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. కరోనా కష్టకాలంలో సైతం అభివృద్ధి, సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు.
గ్రామాలను అభివృద్ధి చేసేందుకు రూ.77.50 లక్షలతో కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. జడ్పీ నిధుల నుంచి రూ.43లక్షలు, ఎస్డీఎఫ్ నిధులు రూ.24. 50లక్షలు, డీఎంఎఫ్ నిధులు రూ.10లక్షలను కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు రాంబాల్ నాయక్, జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్ముదిరాజ్, జడ్పీటీసీ శ్రీలత, ఎంపీపీ మధుసూదన్రెడ్డి, ఎంపీడీవో జ్యోతి, వైస్ ఎంపీపీ శోభలింగం, పీఆర్ ఏఈ హేమంత్, మున్సిపాలిటీ చైర్పర్సన్ లావణ్య, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు సంతోశ్నాయక్, ఎంపీటీసీల సంఘం మండలాధ్యక్షుడు రవీందర్రెడ్డి, ఎస్టీ సెల్ మండలాధ్యక్షుడు గోపాల్నాయక్, గూడూరు, మక్తగూడ సర్పంచ్లు సత్తయ్య, రాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ భీమయ్య పాల్గొన్నారు.
దర్గా మాస్టర్ ప్లాన్పై ఎమ్మెల్యే ఆరా
మండల పరిధిలోని సయ్యద్ హజరత్ జహంగీర్పీర్ దర్గాను సీఎం కేసీఆర్ గతంలో 100 కోట్లతో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో మాస్టర్ ప్లాన్ ప్రకారం పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో శుక్రవారం మండల పరిధిలోని దర్గాను ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ సందర్శించి పనులు, కార్యాచరణపై ఆరా తీశారు. అతి త్వరలో పనులు ప్రారంభంకానున్న నేపథ్యంలో దర్గాను సందర్శించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు రాంబాల్నాయక్, జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్ముదిరాజ్, నాయకులు పాల్గొన్నారు.