కడ్తాల్, జూన్ 21 : పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో తాసిల్దార్ మహేందర్రెడ్డి అధ్యక్షతన 33 మందికి కల్యాణలక్ష్మి, ముగ్గురికి షాదీముబారక్ చెక్కులను జడ్పీటీసీ దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. పేదలు ఆడబిడ్డ పెండ్లి చేయడానికి పడుతున్న కష్టాలను గుర్తించిన, ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. మండలంలోని చరికొండ గ్రామానికి చెందిన రమేశ్కి రూ.18 వేలు, పద్మకి రూ.25 వేలు, కడ్తాల్ గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డికి రూ.56 వేలు, మైసిగండి గ్రామానికి చెందిన గాంస్యనాయక్కి రూ.26 వేలు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు మంజూరయ్యాయి. స్థానిక నాయకులతో కలిసి లబ్ధిదారులకు చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.
రెండు రోజుల క్రితం మండలంలోని కర్కల్పహాడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రాసమల్ల గోవింద్ కుటుంబాన్ని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పరామర్శించారు. రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో సర్పంచులు హరిచంద్నాయక్, తులసీరాంనాయక్, కృష్ణయ్యయాదవ్, భారతమ్మ, భాగ్యమ్మ, కమ్లీ, శంకర్, రవీందర్, ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్, శ్రీనివాస్రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు వీరయ్య, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జహంగీర్అలీ పాల్గొన్నారు.