నమస్తే తెలంగాణ న్యూస్నెట్వర్క్: దివంగత ప్రధాని రాజీవ్గాంధీ దేశా నికి చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు నాయకులు పేర్కొన్నారు. రాజీవ్గాంధీ వర్ధంతిని శుక్రవారం షాద్నగర్, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు నియోజక వర్గాల్లో నిర్వహించారు. కడ్తాల్లో జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్య క్షుడు మల్లు రవి పాల్గొన్నారు. మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో రాజీ వ్గాంధీ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాం గ్రెస్ నాయకులు మాస్కులు పంపిణీ చేశారు. అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రంలో జడ్పీటీసీ దాస్గౌడ్, కొత్త ప్రభాకర్, సీనియర్ నాయకుడు మహేందర్గౌడ్ నిబంధనలు పాటిస్తూ రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానిగా రాజీవ్గాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. అనంతరం పం చా యతీ కార్మికులకు మాస్కులు పంపిణీ చేశా రు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధి తొర్రూర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వ హించారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హాజరై రాజీవ్గాంధీ చిత్రప టానికి నివాళులర్పించారు. రంగారెడ్డి మాట్లాడు తూ రాజీవ్గాంధీ దేశంలో నూతన ఆర్థిక సంస్క రణలు తీసుకువచ్చి ఆర్థిక అభివృద్ధికి బాటలు వేశారన్నారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామా ల ప్రజలకు 10 వేల మాస్కులు పంపిణీ చేశారు. తుర్కయాంజాల్లో కౌన్సిలర్ మంగమ్మ ఆధ్వ ర్యంలో రాజీవ్గాంధీ చిత్ర పటానికి నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేదలకు బియ్యం, నిత్యావసర సరుకులతో పాటు మా స్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి శివకుమార్, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.