షాబాద్, సెప్టెంబర్ 20: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొవిడ్-19 వ్యాక్సిన్ వేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు ప్రభుత్వ దవాఖానల్లోనే వ్యాక్సిన్ వేసే కార్య క్రమాన్ని నిర్వహించిన ప్రభుత్వం తాజాగా గ్రామాల్లో కూడా ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ దవఖాన పరిధిలోని గ్రా మాలను ఎంపిక చేసి రోజు ఓ గ్రామంలో ప్రత్యేక కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి అర్హులందరికి టీకా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అంగన్వాడి టీచర్లు, పంచాయతీ కార్యదర్శులు, ఆశవర్కర్లు, వైద్యసిబ్బంది గ్రామాల్లో పర్యటించి ప్రజలకు వ్యాక్సిన్పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. 20రోజుల్లో అన్ని గ్రామాల్లో వందశాతం వ్యాక్సిన్ వేయించేలా చర్యలు చేపడుతున్నారు. చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్పల్లి మండలం శేరిగూడ గ్రామంలో ఇప్పటికే వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి కావడంతో ఆ గ్రామం ఆదర్శంగా నిలిచింది.
శంకర్పల్లి మండలంలోని శేరిగూడ గ్రామంలో మొత్తం 884 మంది జనా భా ఉంది. ఇందులో 503 మందిని కొవిడ్-19 వ్యాక్సినేషన్కు అర్హులుగా గుర్తించారు. అందులో నుంచి ఇంతకు ముందే 311 మందికి వైద్యసిబ్బంది టీకా వేశారు. మూడు రోజుల క్రితం ఉన్నాతాధికారుల ఆదేశానుసారం వైద్య సిబ్బంది గ్రామంలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో గ్రామంలో మిగిలి పో యిన 192మందికి కూడా వ్యాక్సిన్ వేశారు. దీంతో ప్రస్తుతం ఆ గ్రా మంలో 18 ఏండ్లు నిండి వ్యాక్సిన్ వేసుకోకుండా ఉన్నవారు ఒక్కరూ కూడా లేరు. పేదల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టిన ప్రభుత్వం గ్రామంలో ఉన్న అర్హు లందరికీ వ్యాక్సిన్ వేయించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇంటింటి సర్వేతో అవగాహన…
గ్రామంలో అంగన్వాడి టీచర్లు, ఆశవర్కర్లు, పంచాయతీ కార్యదర్శి, వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టారు. ఇంటిలో ఎంతమంది ఉన్నారు…? ఎం తమంది టీకా వేయించుకున్నారు…?మొదటి డోస్ టీకా ఎంతమంది తీసు కున్నారు…? రెండవ డోస్ ఎంతమంది వేయించుకున్నారనే పూర్తి వివ రాల ను సేకరించారు. దీంతో వ్యాక్సిన్ వేయించుకోని వారికి అర్థమయ్యేలా వివ రించారు. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎలాంటి హాని జరగదని, ఆరో గ్యంగా ఉంటారని ధైర్యం చెప్పడంతో టీకా వేసుకునేందుకు ప్రజలు ముందుకు వచ్చిన్నట్లు వైద్యసిబ్బంది చెబుతున్నారు. అందరి భాగస్వామ్యంతో గ్రా మంలో 100శాతం వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టామని తెలిపారు.
అర్హులందరికీ టీకా వేశాం
స్పెషల్ డ్రైవ్లో భాగంగా శేరిగూడ గ్రామంలో అర్హులందరికీ టీకా వేశాం. ముందుగా గ్రామంలో ఇంటింటి సర్వే చేపట్టాం. వ్యాక్సిన్ వేసుకొని వారి ని గుర్తించి తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకునేలా అవగాహన కల్పించడంతో వారు ధైర్యంగా ముందుకు వచ్చి వ్యాక్సిన్ వేసుకున్నారు.
-ధనలక్ష్మి, హెల్త్ అసిస్టెంట్
వ్సాక్సిన్ ఇవ్వడం సంతోషకరం
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఇంటివద్దే టీ కాలు ఇవ్వడం సంతోషకరం. గతంలో వ్యాక్సిన్ కోసం శంకర్పల్లి, టంగటూర్ ప్రభుత్వ దవా ఖానలకు వెళ్లి ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేది. భౌతిక దూరం పాటించకుండా ఒకరిపై ఒకరు పడుతూ గంటలతరబడి వేచి ఉండి వ్యాక్సిన్లు తీసుకున్నారు.
గ్రామంలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయడంతో ప్రజలకు వ్యాక్సినేషన్పై అవగాహన కల్పించాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో ప్రత్యేక వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు వ్యాక్సినేషన్ చే యడం సంతోషకరం. గ్రామంలో మొత్తం 884 మంది జనాభా ఉండగా అందులో 503 మందికి వ్యాక్సినేషన్కు అర్హులుగా గుర్తించారు.
-సత్యనారాయణ, సర్పంచ్