వీడియో కాన్ఫరెన్స్లో
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్ గోయల్
షాబాద్, జూన్ 19 : త్వరలో స్పెషల్ సమ్మరీ రివిజన్ ప్రారంభం కానున్నందున ఓటరు జాబితాలను చెక్ చేసి, ఓటరు జాబితాకు సంబంధించిన అన్ని దరఖాస్తులను ఈ నెలఖారులోగా పరిశీలించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ కలెక్టర్లకు సూచించారు. శనివారం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటరు జాబితా, ఈవీఎంలు, పెండింగ్ దరఖాస్తుల పరిష్కరించాలని సూచించారు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, సవరణలు, ఆక్షేపణలకు సంబంధించిన పనులను రోజువారీగా సమీక్షించాలన్నారు. ఫారం 6, 7, 8, 8ఎ ైక్లెమ్స్కు సంబంధించి వేగవంతంగా పరిష్కరించాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్, డీఆర్వో హరిప్రియ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.