షాద్నగర్, మే17: వైద్యం కోసం వచ్చే పేద ప్రజలు ఆకలితో ఇబ్బందులు పడొద్దని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సొంత ఖర్చులతో అన్ని దవాఖానల వద్ద కొవిడ్ బాధితులు, దవా ఖాన సిబ్బంది, బాధితుల సహాయకులకు ఉచితంగా భోజ నాన్ని అందించేందుకు శ్రీకారం చుట్టారు. లాక్డౌన్ కొనసా గుతున్న సమయంలో హోటళ్లు మూసి ఉండడంతో గ్రామాల నుంచి వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించి ఉచిత భోజన వసతి కల్పించడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం షాద్ నగర్ సర్కారు దవాఖా న ఆవరణలో మున్సిపల్ చైర్మన్ నరేం దర్, జడ్పీటీసీ వెంక ట్రాంరెడ్డి, ఏసీపీ కుషాల్కర్, టీఆర్ఎస్ నాయకులు మురళీ కృష్ణయాదవ్ ఉచిత భోజన వసతిని ప్రా రంభించారు. నిత్యం 300 నుంచి 400 మందికి భోజన వసతి కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రతి రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రధాన దవాఖానల వద్ద, పరీక్షల కేంద్రాల వద్ద వసతిని కల్పించేలా చర్యలు తీసు కున్నామని వివరించారు. బాధితులు, వారి కుంటుంబ సభ్యు లు భోజన వసతిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లాక్డౌన్ ఉన్న రోజులన్నీ వసతి ఉంటుందన్నారు. ఉచితం గా భోజనం అందిస్తున్న ఎమ్మెల్యేను స్థానికులు కొని యాడా రు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంఎస్. నట రాజన్, మాజీ చైర్మన్ అగ్గనూరు విశ్వం, కౌన్సి లర్లు బచ్చ లి నర్సింహ, ప్రతాప్రెడ్డి, టీఆర్ఎస్ ఎస్టీ సెల్ నా యకుడు లక్ష్మన్ నాయక్, అశోక్, శ్రీకాంత్, నవీన్ పాల్గొన్నారు.