ఇబ్రహీంపట్నం/ ఇబ్రహీంపట్నంరూరల్ మే 14: ఇబ్ర హీం పట్నం నియోజకవర్గంలో మూడవరోజు లాక్డౌన్ సం పూర్ణంగా కొనసాగింది. ఉదయం 10గంటల తరువాత ప్రజ లు ఎవరు రోడ్లపైకి రాకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు నాలుగు గంటల పాటు నిత్యావసర సరుకులు, కూరగా యలతో పాటు ఇతర సామాగ్రికి సంబంధించిన దుకాణాలు తెరిచి ఉంచడంతో ప్రజలు కొనుగోలు చేసుకుని ఇండ్లకే పరి మితమవుతున్నారు. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంతో పా టు బొంగ్లూరు, ఆగాపల్లి, యాచారం, మంచాల, అబ్దుల్లా పూర్మెట్ కేంద్రాల్లో పోలీసులు చెక్పోస్టులను ఏర్పాటు చేసి అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారి వాహనాలను సీజ్చేశారు. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో సీఐ సైదులు ఆధ్వర్యంలో లాక్డౌన్ ఆంక్షలు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వాహనాలు సీజ్చేయడంతో పాటు రోడ్లపైన తిరిగేవారిపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ముమ్మరంగా వాహనాల తనిఖీ
యాచారం, మే14: ఉదయం 10గంటల తరువాత యా చా రం, మాల్, గున్గల్తో పాటుగా మండలంలోని అన్ని గ్రా మాలలో దుకాణాలను పోలీసులు బంద్ చేయించారు. గున్ గల్ నుంచి మాల్ వరకు సాగర్హ్రాదారిపై రాకపోకలు కొన సాగించిన వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేశారు. అత్య వసర వాహనాలు మినహాయిస్తే ఆటోలు, క్రూజర్లు మిగతా ప్రైవేటు వాహనదారులకు వార్నింగ్ ఇచ్చి తిరిగి వెనక్కి పం పించారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోనున్నట్లు సీఐ లింగయ్య తెలిపారు.
షాద్నగర్టౌన్ మే 14: షాద్నగర్ పట్టణ ముఖ్యకూడలితో పాటు ప్రధాన దారులన్ని నిర్మానుష్యంగా మారాయి. అదే విధంగా పట్టణ ముఖ్యకూడలిలో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వద్ద శుక్రవారం లాక్డౌన్ సమయంలో రోడ్డుపైకి వచ్చిన వాహ నాలను తనిఖీ చేశారు. అనవసరంగా ఎవరు బయటకు రావొ ద్దని, లాక్డౌన్ సమయంలో ఇండ్లకే పరిమితం కావాలని సూ చించారు. లాక్డౌన్ సమయంలో ప్రభుత్వ సూచించిన నిబం ధనలను అందరూ పాటించాలన్నారు.
కడ్తాల్, మే 14: ఉదయం 10 గంటల తర్వాత లాక్డౌన్ అమలులోకి రావడంతో అత్యవసర సేవలు అందించే దవా ఖానలు, మెడికల్ షాపులు మినహా మిగతా దుకాణాలను మూసివేస్తున్నారు. ప్రజలందరూ ఇండ్లలోనే ఉండటంతో, రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. లాక్డౌన్ సమ యంలో అనవసరంగా బయటకు వచ్చి నిబందనలను ఉల్లం ఘిస్తే చర్యలు తప్పవని ఎస్సై సుందరయ్య హెచ్చరించారు.