నందిగామ,మే14: కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జ్వర సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని డిప్యూటీ డీఎం అండ్ హెచ్ వో దామోదర్ అన్నారు. నందిగామ మండల కేంద్రంతో పాటు అంతిరెడ్డిగూడ గ్రామంలో నిర్వహిస్తున్న జ్వర సర్వేను శుక్రవారం ఆయన సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు జిల్లెల వెంకట్రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటిలో జ్వర సర్వే నిర్వహించి కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించి మందులు అందజే యలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు శానిటైజర్ ఉపయోగించాలని, కరోనా నియంత్రణలో భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మెక్కొండ కుమార్గౌడ్, ఎంపీడీవో బాల్రెడ్డి, డాక్టర్ మని సురేశ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
కేశంపేటలో కొనసాగుతున్న సర్వే
కేశంపేట మే 14: కేశంపేట మండలంలోని గ్రామాల్లో వైద్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు జ్వర సర్వేను కొనసా గిస్తున్నారు. మండలంలోని చౌలపల్లిలో శుక్రవారం సిబ్బం ది గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు జ్వర లక్షణాలపై సర్వే చేసి వారికి మందులను అందజేశారు. ప్రజలు కరోనా మహమ్మారి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త జయమ్మ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.