షాద్నగర్టౌన్, జూలై 11: కరోనా విపత్కర పరిస్థితుల్లో అందించిన వైద్య సేవలకు గాను షాద్నగర్ డిప్యూటీ డీఎంహెచ్వో దామోదర్తో పాటు వైద్యులు, వైద్య సిబ్బంది ఉత్తమ అవార్డులు అందుకున్నారు. ప్రపంచ జనాభా డే సందర్భంగా ఆదివారం హైదరాబాద్ కామినేని దవాఖానలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి స్వరాజ్యలక్ష్మి ఉత్తమ అవార్డులను అందజేసినట్లు డిప్యూటీ డీఎంహెచ్వో దామోదర్ తెలిపారు. ఇందులో భాగంగానే ఫరూఖ్నగర్ మండలం చించోడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సాయిలక్ష్మి, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాస్, సూపర్వైజర్లు లిల్లీ, రవికుమార్, శ్రీనివాస్, కొందుర్గు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్టాఫ్ నర్స్ సుజాన్, కొత్తూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది సులోచన, ఆశలు కవిత, సక్కుబాయ్, రాములమ్మ, ల్యాబ్ టెక్నిషియన్ రాజు, 104 టెక్నిషియన్ శ్రీనివాస్, ఫార్మసిస్ట్ హన్మంత్ ఉత్తమ అవార్డులు, ప్రశంసా పత్రాలను అందుకున్నారని చెప్పారు.
కొత్తూరు..
కొత్తూరు, జూలై 11 : ఉత్తమ వైద్య సేవలు అందించిన సిబ్బందికి అవార్డులు అందజేశారు. ఉత్తమ మెడికల్ ఆఫీసర్గా కవిత, ఉత్తమ ఏఎన్ఎంగా సులోచన, ఉత్తమ ఆశ వర్కర్గా కవిత అవార్డులు అందుకున్నారు.
పీహెచ్సీ సిబ్బందికి పురస్కారాలు
శంకర్పల్లి, జూలై 11 : ప్రపంచ జనాభా డే సందర్భంగా పీహెచ్సీ సిబ్బంది పురస్కారాలు అందుకున్నారు. పురస్కారాలు అందుకున్న వారిలో ఎంపీహెచ్ఈవో శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్, స్టాఫ్ నర్స్ అనురాధ, హెల్త్ అసిస్టెంట్ సుదర్శన్రెడ్డి, విజయలక్ష్మి, ధోరతి, అనిత ఉన్నారు.
జిల్లా స్థాయి ఉత్తమ అవార్డులు
షాబాద్, జూలై 11 : కొవిడ్-19 కారణంగా రెండేండ్లుగా సేవలందిస్తున్న వైద్యసిబ్బందికి జిల్లా స్థాయిలో ఉత్తమ అవార్డులు అందజేశారు. ఆదివారం ప్రపంచ జనాభా డే సందర్భంగా కామినేని దవాఖానలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి స్వరాజ్యలక్ష్మి జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి అవార్డులు అందజేశారు. జిల్లా అదనపు వైద్యాధికారి దామోదర్, షాబాద్ ప్రభుత్వ దవాఖాన ల్యాబ్ టెక్నిషీయన్ బైరంపల్లి నవీన్కు జిల్లా ఉత్తమ అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.