షాబాద్, జూలై 11 : పర్యావరణ పరిరక్షణకు అందరూ తమవంతుగా మొక్కలు నాటాలని ఎంపీపీ ప్రశాంతిమహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని పోతుగల్ గ్రామంలో వైస్ ఎంపీపీ లక్ష్మి, సర్పంచ్ ఇస్మత్బేగంతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అడవులను సంరక్షించేందుకు సీఎం కేసీఆర్ హరితహారానికి శ్రీకారం చుట్టారని వివరించారు. గ్రామాల్లో భారీగా మొక్కలు నాటామన్నారు. ఖాళీ స్థలం ఎక్కడ ఉంటే అక్కడ మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో కో-ఆప్షన్ మండల మాజీ సభ్యుడు అయూబ్, కార్యదర్శి అశోక్, టీఆర్ఎస్ నాయకులు మునీర్షరీఫ్, షబ్బీర్, రాజు పాల్గొన్నారు.
ఇంటింటికీ మొక్కలు పంపిణీ
కొత్తూరు, జూలై 11 : మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్య ఆదివారం ఇంటింటికీ తిరిగి మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హరిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకురావాలన్నారు. అందుకోసం ప్రతి ఇంటి ఆవరణలో కనీసం 5 మొక్కలు నాటాలన్నారు. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సహకారంతో మున్సిపాలిటీని హరిత మున్సిపాలిటీగా మారుస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రవీందర్, కౌన్సిలర్లు మాజీ ఎంపీటీసీ యాదయ్య, నాయకులు దేవేందర్యాదవ్, శ్రీనివాస్గౌడ్, గోపాల్గౌడ్, ఆంజనేయులు, సీటీకేబుల్ వెంకటేశ్ పాల్గొన్నారు.
విధిగా మొక్కలు నాటాలి
షాబాద్, జూలై 11 : హరితహారంలో ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని సీఐ ఆశోక్కుమార్ అన్నారు. ఆదివారం పోలీస్స్టేషన్ ఆవరణలో సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. కాలుష్యాన్ని నివారించేందుకు తప్పనిసరిగా మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్ఐ శంకర్రెడ్డి పాల్గొన్నారు.