ఇబ్రహీంపట్నం, మే 10 : కరోనా విపత్కర పరిస్థితుల్లో అంగన్వాడీ, ఆశ వర్కర్లది కీలకపాత్ర అని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో, ఆయాలు, టీచర్లుగా ఎంపికైన వారికి సోమవారం క్యాంపు కార్యాలయంలో నియామక పత్రాలు అందజేసి మాట్లాడారు. గ్రామాల్లో గర్బిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందజేయడంతో పాటు ఎప్పటికప్పుడు వారికి అండగా నిలువాలని తెలిపారు. ఆశ వర్కర్లు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని తెలిపారు. ఈ సందర్భంగా లింగంపల్లి అంగన్వాడీ ఆయాగా ఎంపికైన ఫర్జావాబేగం, సత్తితండా ఏడబ్ల్యూఎచ్గా ఎంపికైన స్వప్న, తులేకలాన్ ఆయాగా ఎంపికైన మాధురికి నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రమణారెడ్డి, సీడీపీవో శాంతిశ్రీ పాల్గొన్నారు.
స్టడీ మెటీరియల్ అందజేత
పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీలేదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఎంకేఆర్ ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్న కానిస్టేబుల్, ఎస్సై ఉచిత శిక్షణకు ఎంపికైన విద్యార్థులకు సోమవారం ఇబ్రహీంపట్నంలో స్టడీమెటీరియల్ను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు పొందే వరకు ఎంకేఆర్ ఫౌండేషన్ అండగా నిలుస్తున్నదని తెలిపారు. ఎంకేఆర్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ శిబిరానికి ఎంపికైన అభ్యర్థులు ఇంటిదగ్గరే చదివి ఉద్యోగాలు సాధించాలని తెలిపారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా దశలవారీగా అభ్యర్థులకు మెటీరియల్ అందజేస్తామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రమణారెడ్డి, ఫౌండేషన్ కార్యదర్శి రాజు, సభ్యులు మడుపు శివసాయి, చెనమోని శివ, యుగేందర్ తదితరులున్నారు.