బొంరాస్పేట, మే 10 : కొవిడ్ నివారణకు టీకా పంపిణీ కార్యక్రమం మండలంలో చురుకుగా కొనసాగుతున్నది. మొదటి డోసు తీసుకున్న 45 ఏళ్లు పైబడిన వారికి రెండవ డోసు టీకాను వేస్తున్నారు. సోమవారం మండల కేంద్రం లోని పీహెచ్సీలో 102 మందికి రెండవ విడత టీకా వేసి నట్లు వైద్యాధికారి రవీంద్ర యాదవ్ తెలిపారు. వైస్ ఎం పీపీ శేరి నారాయణరెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, మండల పరిషత్ సూపరింటెం డెంట్ మోహన్రాజ్, సీనియర్ అసిస్టెంట్ నార్యానాయక్ తదితరులు రెండవ డోసు టీకా తీసుకున్నారు. ఇదిలా ఉండగా సోమవారం మండలంలో 26 మందికి కరోనా వైరస్ సోకింది. 51 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 26 మందికి పాజిటివ్ నిర్ధారణ అయిందని వైద్యాధికారి తెలిపారు.
మరో రెండు గ్రామాల్లో లాక్డౌన్
సోమవారం నుంచి మండలంలోని బొంరాస్పేట, ఏర్పు మళ్ల గ్రామాల్లో స్వచ్ఛందంగా లాక్డౌన్ విధించారు. గ్రామాలలో కరోనా కేసుల ఉధృతి ఎక్కువగా ఉండడంతో బొంరాస్పేటలో ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఏర్పుమళ్లలో ఉదయం 6 గంటల నుంచి 11.30 గంటల వరకే దుకాణాలను తెరిచి ఉం చాలని నిర్ణయించారు. బొంరాస్పేటలో ఈ నెలాఖరు వర కు లాక్డౌన్ ఉంటుందని, నియమాలను ఉల్లం ఘించిన వారికి వెయ్యి రూపాయలు జరిమానా విధి స్తామని సర్పంచ్ కోవూరు జయమ్మ తెలిపారు. ఇప్పటికే తుంకిమెట్ల, నాగిరెడ్డిపల్లి గ్రామాల్లో స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటిస్తున్నారు. కరోనా భయంతో మిగతా గ్రామాల్లో కూడా జన సంచారం తక్కువగా ఉంది.
సెకండ్ డోస్ టీకాను పరిశీలించిన చైర్ పర్సన్
జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్ కాలనీ సమీపంలోని వంద పడకల ఆసుపత్రిలో మున్సి పల్ కార్మికులకు కరోనా సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ను చిగుళ్లపల్లి మంజుల సోమవారం పరిశీలించారు. అనం తరం ఆమె మాట్లాడుతూ, మున్సిపల్లో పారిశుధ్య కార్మి కుల పాత్ర చాలా కీలకమని తెలిపారు. అలాంటి కార్మికు లను కాపాడుకోవడం తమ బాధ్యత అన్నారు.
నేటి నుంచి బార్వాద్లో లాక్డౌన్
సోమవారం మండలంలోని బార్వాద్ గ్రామ ప్రజలు, వ్యాపారస్తులు సర్పంచ్ సమక్షంలో పం చాయతీ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహిం చారు. నేటి నుంచి 14 రోజుల పాటుగా స్వచ్ఛంద లాక్ డౌన్ ను అమలు చేయాలని తీర్మానం చేశారు. ఎవరికి ఎలాం టి ఇబ్బందులు ఉన్న పరీక్షలు చేయించుకుని, ఇంట్లోనే ఉంటూ వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుని సహ కరించాలని సూచించారు.