తాండూరు, జూలై 7: పండుగలా హరితహారం నిర్వహించాలని ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు మున్సిపల్ పరిధిలోని 4వ వార్డులో పట్టణ ప్రగతి, హరితహారంలో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తన వంతు బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. పట్టణ అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల చేసి యుద్ధప్రాతిపదికన పనులు చేస్తామన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీగౌడ్ మాట్లాడుతూ అడవుల శాతాన్ని పెంపొందించేందుకు హరితహారంలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో అశోక్కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, వైస్ చైర్పర్సన్ దీప, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్నాయక్, టీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్లీడర్ శోభారాణి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అదే విధంగా తాండూరు ప్రాంతంలో జరుగుతున్న ఆర్ఆండ్బీ రోడ్ల మరమ్మతులను ఎమ్మెల్యే రోహిత్రెడ్డి పరిశీలించారు.
రైతుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి
రైతుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పైలట్ రోహిత్రెడ్డి అన్నారు. యాలాల మండలంలోని బాగాయిపల్లి నుంచి అచ్యుతాపూర్ వరకు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. యాలాల మండలంలోని 24 గ్రామపంచాయతీ పరిధిలో యాలాల, అగ్గనూర్, కోకట్, జుంటుపల్లి, రాస్నం క్లస్టర్లలో రైతువేదిక నిర్మాణాలను చేపట్టామన్నారు. వీటి నిర్మాణానికి రూ.22 లక్షలను వెచ్చించిందన్నారు. వ్యవసాయ శాఖ రూ.12 లక్షలు, ఉపాధి హామీ కింద రూ.10 లక్షలు కేటాయించామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలేశ్వర్గుప్తా, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్నాయక్, వైస్ ఎంపీపీ రమేశ్, జిల్లా కో ఆప్షన్ అధ్యక్షుడు అక్బర్ బాబా, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
నవల్లా గ్రామంలో..
బషీరాబాద్, జూలై 7 : నవల్గా గ్రామంలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. అదేవిధంగా పోలీస్శాఖ తరఫున బషీరాబాద్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రయంలో ఎస్సై విద్యాచరణ్రెడ్డి, ఎంపీడీవో రమేశ్, నాయకులు నర్సిరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీనివాస్, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.