మంత్రి సబితారెడ్డి
షాద్నగర్, జూన్6: రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పోరేషన్లను దశల వారీగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం మీర్పేట మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో రూ. 63.50 లక్షల నిధులతో పలు అభివృద్ధి కార్యక్ర మాలను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. నగర శివారు మున్సి పా లిటీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారని వివరించారు. వర్షా కాలంలో స్థానికులకు ఇబ్బందులు కలుగకుండా వర్షం నీరు సజావుగా పోయేందుకు చెరువులకు అను సంధాన కాలువలను ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు. విజ్ఞానపురి కాలనీ నుంచి చెరువు వరకు రూ. 26 కోట్ల నిధులతో ట్రంక్ లైన్ నిర్మాణంతో పాటు భారీ మురుగు కాలువ నిర్మాణాన్ని చేపట్టేందుకు చర్యలు తీసుకున్నా మన్నారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో కాలనీలో ఏర్పాటుచేసిన ఓపెన్ జిమ్ స్థానిక యువకులకు ఎంతగానో ఉపయోగపడుతుం దని వివరించారు. కార్యక్రమంలో మేయర్ దుర్గాదీప్ లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్రెడ్డి, కమిషనర్, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.