బంట్వారం, మే 6 : మండలంలో ఇప్పటి వరకు 1680 ఇండ్లను సందర్శించి జ్వర సర్వే నిర్వహించారని ఎంపీవో విజయ్కుమార్ తెలిపారు. గురువారం ఆయా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు ప్రతి ఇంటికి వెళ్లి జ్వర సర్వే చేసి రికార్డు చేస్తున్నారని చెప్పారు. మండలంలో మొత్తం 4661 ఇండ్లు ఉండగా, సర్వే కోసం 14 టీమ్లను ఏర్పాటు చేశారు.
కోట్పల్లి , మే 6 : గ్రామాల్లో జ్వర సర్వేలను నిర్వహిస్తున్నట్లు మండల అభివృద్ధి అధికారి లక్ష్మీనారాయణ తెలిపారు. గురువారం మండలంలోని జిన్నారం, మొత్కుపల్లి, రాంపూర్, తదితర గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, ఆశవర్కర్లు ఇంటింటా సర్వేలను నిర్వహించారు. ఈ సర్వేల్లో భాగంగా ఇంట్లో ఎవరికైనా ఫీవర్ ఉన్నట్టుగా అనిపిస్తే.. ముందు జాగ్రత్తగా టాబ్లెట్లను అందిస్తున్నామన్నారు.