ఇబ్రహీంపట్నంరూరల్, ఏప్రిల్ 5 : రోజు రోజుకూ భానుడు భగభగ మండిపోతున్నాడు. ఈ ఎండల తీవ్రతకు మనుషులతో పాటు పశువులు కూడా వడదెబ్బ బారిన పడే అవకాశముంది. వాతావరణంలో ఉష్ణోగ్రత ఎక్కువైనప్పుడు జీవక్రియ దెబ్బతింటుంది. శరీర ఉష్ణోగ్రత పెరిగి శ్వాస, గుండె, నాడీమండలం, మూత్రపిండాల విధులు తగ్గిపోయి పశువుల ఆరోగ్యం విషమంగా మారే అవకాశముంది. రైతులు ఎప్పటికప్పుడు పశువులకు ఎలాంటి అపాయం జరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పశువైద్యాధికారులు సూచిస్తున్నారు.
వడదెబ్బ లక్షణాలు..
పశువుల్లో శరీర ఉష్ణోగ్రత 103డిగ్రీల సెల్సియస్ కంటే మించుతుంది. చర్మం మృదుత్వం తగ్గిపోయి గట్టిపడుతుంది. నోటితో గాలి పీల్చుకోవడం, నోటి వెంట చొంగకారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆవుల్లో పాల దిగుబడి, పునరుత్పత్తి, చూలుకట్టే శాతం తగ్గి గర్భస్రావం అయ్యే అవకాశం ఉంటుంది.
కారణాలు..
చికిత్స..
వడదెబ్బకు గురైన పశువులను వెంటనే నీడ ప్రాంతంలోకి మార్చి వీలైతే ఫ్యాన్లు లేదా కూలర్ల సాయంతో చల్లని గాలిని అందించాలి. బాగా ఎండగా ఉన్న సమయాల్లో పశువులను చల్లని నీటితో పలుమార్లు కడగాలి. చల్లని నీరు తాగడానికి అందుబాటులో ఉంచి నొప్పులను తగ్గించడానికి నొప్పి నివారణ కోసం (అనాల్జెసిక్)మందును వాడాలి.
నివారణ చర్యలు..
వేసవిలో పశువులను ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 3గటల వరకు మేతకు బయటకు వదలకూడదు. చల్లని నీరు తాగేందుకు పశువులకు అందుబాటులో ఉంచాలి. రోజుకు మూడు నుంచి నాలుగుసార్లు చల్లని నీటితో కడుగాలి. లేదా నీటి చెరువులు, గుంతలున్న చోట నీళ్లలోకి వదలాలి. కొట్టాలను బాగా ఎత్తులో నిర్మించుకుని ఎండుగడ్డితో కప్పాలి. ఎండ ఉన్న సమయంలో దాని మీద నీల్లు చల్లుతుండాలి. ఇలా చేస్తే వడదెబ్బనుంచి పశువులను కాపాడుకోవచ్చు.
ఇవీ కూడా చదవండి…
సంగారెడ్డి జెడ్పీ మరిన్ని అవార్డులు సాధించాలి: మంత్రి హరీశ్ రావు
దళితుల అభ్యున్నతికి బాబు జగ్జీవన్ రామ్ ఎనలేని కృషి
భగత్ను భారీ మెజార్టీతో గెలిపించాలి : మంత్రి జగదీశ్ రెడ్డి