న్యూస్నెట్వర్క్, నమస్తే తెలంగాణ: దివంగత ఉపప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు సోమవారం చేవెళ్ల, షాద్నగర్ నియోజకవర్గాల్లో ఘనంగా జరిగాయి. చేవెళ్ల మండల కేంద్రంలోని బాబు జగ్జీవన్రామ్ విగ్రహా నికి ఎమ్మెల్యే కాలె యాదయ్య నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మహనీయుల అడుగుజాడల్లో నడు స్తూ ఆదర్శంగా నిలువాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయక్ష్మీ, వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్ పాల్గొన్నారు. పామెన గ్రామంలో మాజీ సర్పంచ్ గోపాల్రెడ్డి నివాళులర్పించారు. షాబాద్, పోతుగల్ గ్రామాల్లో ఆయన విగ్రహాలకు పలువురు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మొయినాబాద్లోని అంబేద్కర్ చౌరస్తాలో మహనీ యుల జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆయన చిత్ర పటం ఏర్పాటు చేసి నివాళులర్పించారు. స్వేరో సర్కిల్ ఆధ్వర్యంలో మొయినాబాద్ మం డల కేంద్రంలో నివాళులర్పించారు. శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని పత్తేపురం చౌరస్తా వద్ద జరిగిన కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొ న్నారు.
షాద్నగర్ మున్సిపల్ సమావేశ మందిరంలో మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ కౌన్సిలర్లతో కలిసి నివాళులర్పించారు. మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన జగ్జీవన్రామ్ చిత్ర పటానికి ఎంపీపీ ఖాజా ఇద్రీస్ అహ్మద్, ఎంపీడీవో శరత్బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొందుర్గు, జిల్లెడు చౌదరిగూడ మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యా లయాల్లో జగ్జీవన్రామ్ జయంతి వేడుకలను నిర్వహిం చారు. కులరహిత సమాజం కోసం ఎంతో కృషి చేశారని పలువురు కొనియా డారు దళితులను అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా పని చేశారని అన్నారు. కేశంపేట మండలం వేములనర్వలో సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రా మస్తులు నివాళులర్పించారు. కొత్తూరులో జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు యాదగిరి నాయకులు మహేందర్ రెడ్డి, సుఖేందర్రెడ్డి, రాఘవేందర్యాదవ్, మాజీ సర్పంచ్లు కొస్గి శ్రీను, జెనిగె జగన్, జనార్దన్రెడ్డి, మాజీ ఎంపీటీసీ దేవేందర్యాదవ్ పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి…
టిమ్స్ సేవలు అద్భుతం.. కరోనా బాధితులు హర్షం.. వీడియో
జవాన్లను చుట్టుముట్టిన 400 మంది మావోయిస్టులు
రాష్ట్రంలో కొత్తగా 1097 కరోనా కేసులు