రంగారెడ్డి, జూన్ 4, (నమస్తే తెలంగాణ) : తెలంగాణకు హరితహారంలో భాగంగా జిల్లాలో ఈ ఏడాది నాటాల్సిన మొక్కలకు సంబంధించి టార్గెట్ను ఇప్పటికే నిర్దేశించారు. ఈ ఏడాది ఇచ్చిన లక్ష్యానికి అనుగుణంగా జిల్లా అటవీశాఖతోపాటు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మొక్కలను నాటేం దుకుగాను నర్సరీల్లో మొక్కలను కూడా సిద్ధం చేస్తున్నారు. వచ్చే నెల మొద టి వారంలో హరితహారం కార్యక్రమం ప్రారంభించే అవకాశముంది. ఈ ఏడాది అవెన్యూ ప్లాంటేషన్(రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడం)కు అధిక ప్రాధాన్యతనివ్వనున్నారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా హరితహారం కార్యక్రమంలో అన్ని శాఖలను భాగస్వాములను చేసేలా.. ఆయా శాఖలు నాటాల్సిన మొక్కల లక్ష్యాలను అటవీ శాఖ అధికారులు నిర్ణ యించారు. మొక్కలను నాటిన అనంతరం విస్మరించకుండా ప్రతి మొక్కను బతికించేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టనుంది. హరితహారంలో భాగంగా మొక్కలను నాటేందుకు గుంతలను తీసే ప్రక్రియ నుంచి మొక్కలు నాటే ప్రక్రియ వరకూ ప్రతి మొ క్కకు జియోట్యాగింగ్ చేయను న్నారు. ఈ ఏడాది ప్రధానంగా పండ్ల మొక్క లతోపాటు నీడనిచ్చే మొక్కలను నాటేందుకు ప్రా ధాన్య మివ్వను న్నారు. పర్యావరణాన్ని పెంచడం తోపాటు రాష్ర్టాన్ని ఆకుపచ్చని తెలంగాణగా మార్చేం దుకుగాను ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు హరితహారం కార్యక్ర మానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
తెలంగాణకు హరితహారంలో భా గంగా జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 74.10 లక్షల మొక్కలను నాటా లని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా నిర్ణయించింది. ఈ ఏడాది అటవీ శాఖ ఆధ్వర్యంలో 7లక్షలు, విద్యా శాఖ ఆధ్వర్యంలో 75వేలు, డీఆర్డీ వో ఆధ్వర్యంలో 30లక్షలు, డీపీవో ఆధ్వర్యంలో 5లక్షలు, నీటిపారు దల శాఖ ఆధ్వర్యంలో 10వేలు, ఎక్సైజ్ సూపరింటెండెం ట్ (సరూర్నగర్) ఆధ్వర్యంలో 50వేలు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ (శంషా బాద్) ఆధ్వర్యంలో 50వేలు, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 3లక్షలు, డీఎం హెచ్వో ఆధ్వర్యంలో 10వేలు, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో 2లక్షలు, ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో లక్ష, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 10వేలు, సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 10వేలు, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వ ర్యంలో 5వేలు, గనుల శాఖ ఆధ్వర్యంలో 25వేలు, మార్కెటింగ్ శాఖ ఆధ్వ ర్యంలో 10వేలు, పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో 5వేలు, 16 మున్సిపా లిటీల ఆధ్వర్యంలో 23.50 లక్షల మొక్కలను నాటనున్నారు.
మరో వారం రోజుల్లో హరితహారం మొక్కలు నాటే ప్రక్రియకు సంబంధించి గుంతలు తీసే ప్రక్రియను చేపట్టనున్నారు. ఈ ఏడాది ప్రధానంగా పండ్లు, పూల మొక్కలతోపాటు నీడనిచ్చే మొక్కలు, టేకు, ఉసిరి, జామ, నిమ్మ, సీతాఫల్, దానిమ్మ, పప్పాయ, మునగ, గులాబీ, మందారం, మల్లె, కానుగ, నెమలి నార, శ్రీగంధం తదితర మొక్కలను నాటనున్నారు. జిల్లాలోని ప్రతి గ్రా మంలో ఒక నర్సరీని ఏర్పాటు చేసిన దృష్ట్యా జిల్లావ్యాప్తంగా 560 నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేస్తున్నారు. గతంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలకు మొక్కలను పంపిణీ చేసేవారు. గతేడాది నుంచి ఆయా గ్రామపంచాయతీల్లోనే నర్సరీలను ఏర్పాటు చేసిన దృష్ట్యా ఆయా గ్రామ పంచాయతీల్లోనే నాటనున్నారు.
ఏదేని నర్సరీలో తక్కువ మొక్కలున్న ట్లయితే పక్క గ్రామపంచాయతీలోని నర్సరీ ద్వారా మొక్కలను సేకరించేలా చర్యలు చేపట్టారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామపంచా యతీ ల్లో ఏయే మొక్కలను నాటాలనే దానిపై చేసిన తీర్మానం ప్రకారం సంబం ధిత మొక్కలను గ్రామాల్లోని నర్సరీల్లో పెంచుతున్నారు. ప్రతి గ్రామాన్ని హరితవనంగా మార్చేందుకుగాను ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ప్రతి గ్రామపంచాయతీలో 10 వేల మొక్కలను నాటనున్నారు.