ఇబ్రహీంపట్న ం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి
పలువురు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ
ఇబ్రహీంపట్నం, జూన్ 3 : అభివృద్ధి, సంక్షేమం టీఆర్ఎస్ ప్రభుత్వ ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్నదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. గురువారం నియోజకవర్గ పరిధిలోని ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల మున్సిపాలిటీలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మాట్లాడుతూ.. కష్టకాలంలో కూడా ప్రభుత్వ పథకాలు పేదలకు అందజేయడంలో ప్రభుత్వం వెనక్కితగ్గడడం లేదన్నారు. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. పేద తల్లిదండ్రులకు అండగా నిలిచేందుకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద ఆర్థిక సాయం అందజేస్తుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా గురువారం ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల మున్సిపాలిటీలకు చెందిన 82మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఆదిబట్ల, ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్లు స్రవంతి, ఆర్తిక, వైస్ చైర్మన్ యాదగిరి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, కమిషనర్లు జయంత్కుమార్రెడ్డి, సరస్వతితో పాటు కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఆపత్కాలంలో అండగా సీఎం సహాయనిధి
ఇబ్రహీంపట్నంరూరల్, జూన్ 3 : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేదలకు వరంగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే కిషన్రెడ్డి అన్నారు. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని రాములు ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.53వేల చెక్కును గురువారం క్యాంపు కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమం లో శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే, మండల పరిధిలోని రాయపోల్ గ్రామానికి చెందిన జెట్టి నందితకు ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.42వేల చెక్కును గురువారం గ్రామంలో అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ బల్వంత్రెడ్డి, ఉపసర్పంచ్ బాలరాజు, ఎంపీటీసీలు అచ్చన శ్రీశైలం, భాస్కర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు నర్సింహ, ఈశ్వర్, లక్ష్మారెడ్డి, జంగారెడ్డి, బాలుగౌడ్, నర్సింహ పాల్గొన్నారు.