కొత్తూరు, ఏప్రిల్ 2 : రోడ్డు నిర్మాణాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నదని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్ చెక్పోస్టు నుంచి నందిగామ మండలం చేగూర్ వరకు బీటీ రోడ్డు పనులను ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని గ్రామాలను కలుపుతూ మండల కేంద్రాలకు రోడ్లు నిర్మిస్తున్నామని వివరించారు. తిమ్మాపూర్-చేగూర్ రోడ్డుకు రూ.12 కోట్ల 70 లక్షలు మంజూరయ్యారని వివరించారు. సుమారు 6 కిలోమీటర్లు పొడవు ఉన్న బీటీ రోడ్డును నాణ్యతతో నిర్మించాలని కాంట్రాక్టర్కు సూచించారు. రోడ్లు బాగుంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అందుకోసం ప్రతి గ్రామానికి మెరుగైన రోడ్డు సౌకర్యం ఉండేలా కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ మధుసూదన్రెడ్డి, మాజీ మర్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, చేగూర్ పీఏసీఎస్ చైర్మన్ అశోక్, చేగూర్ సర్పంచ్ సంతోష విఠల్, మాజీ ఎంపీపీ శివశంకర్గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు యాదగిరి, టీఆర్ఎస్ నాయకులు ఎమ్మె సత్యనారాయణ, మహేందర్రెడ్డి, సుఖేందర్రెడ్డి, రాఘవేందర్యాదవ్, మాజీ సర్పంచ్లు కొస్గి శ్రీను, జనార్దన్రెడ్డి, మాజీ ఎంపీటీసీ దేవేందర్యాదవ్ పాల్గొన్నారు.
చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం
వేసవికాలం దృష్ట్యా చలివేంద్రం ఏర్పాటు అభినందనీయమని ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపాలిటీలోని ఈశ్వర్కాలనీ ప్రధాన దారిలో కౌన్సిలర్ సలేంద్రం రాజేశ్వర్ ఏర్పాటు చేసిన అమ్మ చలివేంద్రాన్ని శుక్రవారం మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ నటరాజ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నీటిని వృథా చేయకుండా వాడుకోవాలన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ సలేంద్రం రాజేశ్వర్ను అభినందించారు. కార్యక్రమంలో నాయకులు నారాయణరెడ్డి, శంకర్, శేఖర్, శివ పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి
బంపరాఫర్: సర్కారీ ఉద్యోగులకు లక్ష ఎలక్ట్రిక్ టూ వీలర్స్
జూన్ 30 వరకు హెచ్డీఎఫ్సీ ప్రత్యేక డిపాజిట్ స్కీం
త్వరలోనే స్పుత్నిక్-వీకి అనుమతి
కరోనా మృతుల బీమా క్లెయిమ్స్: రూ.1,986 కోట్లు