దోమ, ఏప్రిల్ 1: దోమ మండల పరిధిలోని పాలేపల్లి గ్రామం పల్లె ప్రగతితో కొత్త పుంతలు తొక్కి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నది. పల్లె ప్రకృతి వనంలో మొక్కలకు నీటి తడులను అందించేందుకు ప్రత్యేకంగా డ్రిప్ విధానాన్ని ఏర్పాటుచేశారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి వాటి కి క్రమం తప్పకుండా గ్రామ పంచాయతీ ట్యాంకర్ ద్వారా నీటిని అందిస్తున్నారు. దీంతో పచ్చదనం వెల్లివిరుస్తున్నది.అభివృద్ధి పనుల్లో భాగంగా రూ. 13 లక్షల నిర్మితమవుతున్న వైకుంఠధా మం పనులు చివరి దశకు చేరుకున్నాయి. సేకరించిన తడి, పొడి చెత్తతో ఎరువును తయారు చేసే దిశగా రూ. 2.5 లక్షలతో కంపోస్టుషెడ్డు ఏర్పాటు చేశారు. రూ. 10 లక్షలతో వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను పూర్తి చేశా రు. దాతల సహకారంతో పల్లె ప్రకృతి వనం, బస్సుషెల్టర్, హనుమాన్ మందిరం దగ్గర బెంచీలను ఏర్పాటు చేశారు. రూ. 9.5 లక్షలతో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్లను కొనుగోలు చేసి పరిశుభ్రత పచ్చ దనాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. అదేవిధంగా నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలను పెంచడంలో ప్రత్యేక కృషి చేస్తున్నారు. మిషన్ భగీరథ పనులను పూర్తి చేసి ప్రతి ఇంటికి తాగు నీరు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు సర్పంచ్ యశోద తెలిపారు.
ముందుండేలా చేస్తా….
గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముం దుకు నడి పేందుకు కృషి చేస్తా. ప్రభు త్వ సహాయ సహకారాలతో అవసర మై న అన్ని పనులు పూర్తి చేస్తా. గ్రామ ప్రాథమిక అవసరాలను గుర్తించి గ్రామ స్తుల తోడ్పాటుతో ముందుకెళ్తాం. పం చాయతీ నిధులను దుర్వినియోగం చేయకుండా గ్రామాన్ని అన్ని రంగాల్లో ప్రగతిపథంలో నడిపిస్తా
-ఉప్పరి యశోద సర్పంచ్
ఇవీ కూడా చదవండీ..
స్త్రీలను గౌరవించని వారికి అధికారం చేపట్టే హక్కులేదు: యూపీ సీఎం
ఎఫ్ఐఆర్ ఎక్కడ? పరమ్బీర్కు బాంబే హైకోర్టు షాక్