తలకొండపల్లి : బాధిత కుటంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. తలకొండపల్లి మండలంలోని చీపునుంతల గ్రామానికి చెందిన వెంకటయ్య, స్వాతి అనే ఇద్దరు ఆనారోగ్యానికి గురయ్యారు. బాధిత కుటుంబ సభ్యులు వైద్యం కోసం ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిని ఆశ్రయింగా ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేయించారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి వెంకటయ్యకు రూ. 16 వేలు, స్వాతికి రూ. 15 వేల విలువ గల చెక్కులు మంజూరయ్యాయి. మంజూరైన చెక్కులను బుధవారం బాధితుల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ అందించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.