షాబాద్ : విద్యాభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. ఆదివారం రంగారెడ్డిజిల్లా పరిషత్తు కార్యా లయం సమావేశ మందిరంలో జరిగిన జిల్లా స్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డితో కలిసి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్డేలు నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో 1.30 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పొందారన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా నిర్వహించే గురుపూ జోత్సవం ఉపాధ్యాయుల్లో స్ఫూర్తి నింపుతుందన్నారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు మిగతా వారికి స్ఫూర్తిదాయకం కావాలన్నారు.
విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత ఉపా ధ్యా యుల దేనన్నారు. చివరి శ్వాస వరకు తెలంగాణ కోసం పని చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తన చిన్నప్పుడు 5 కిలోమీటర్లు సైకిల్ మీద వచ్చి పీర్ల కోటంలో చదువుచెప్పిన ఉపా ధ్యా యు లను ఎప్పటికీ మర్చిపోలేనని మంత్రి తన చిన్ననాటి జ్ఞాప కాలను గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు గతంలో కన్నా ఎక్కువగా ఉపాధ్యా యులు ప్రత్యేక దృష్టితో పనిచేయాలని సూచించారు. పదవ తరగతి విద్యార్థుల పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రత్యేక తరగతులు నిర్వహిం చాలని మంత్రి ఉపాధ్యాయులకు పిలుపు నిచ్చా రు. ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు సీఎం కేసీఆర్ నిధులు విడుదల చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డాక 650 గురుకులాలు ఏర్పాటు చేశామన్నారు.
ప్రభుత్వ గురుకులాల్లో నాణ్యమైన విద్య, వసతి, సన్నబియ్యంతో భోజనం అందిస్తుండడంతో గురుకులాలకు డిమాండ్ పెరిగిం దన్నా రు. రాష్ట్రంలో మొత్తం 60లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుంటే అందులో 30లక్షల మంది ప్రభుత్వ పాఠ శాల విద్యార్థులే ఉన్నారన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల నమో దు పెంచాలన్నారు. పాఠశాలల్లో శానిటేషన్, క్లీనింగ్ను ప్రభుత్వం స్థానిక సంస్థలకు అప్పజెప్పిందన్నా రు. విద్యాశాఖ కమిటీలు చురుకుగా పనిచేసేలా చూడాలన్నారు. విద్యార్థుల్లో ఆత్మస్థెర్యం నింపడానికి కృషి చేయాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రం లో అమలు చేయని విధంగా డిజిటల్, ఆన్ లైన్ క్లాసులు నిర్వహించి కేంద్ర ప్రభుత్వం చేత తెలంగాణ ప్రభుత్వం ప్రశంసలు పొందిందన్నారు. సుమారు 146 మంది జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల ను మంత్రి సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్రెడ్డి, అడిషనల్ కలెక్టర్ ప్రతీక్జైన్, జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్రావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
వికారాబాద్లో…
వికారాబాద్, సెప్టెంబర్ 5: విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించినప్పుడే ప్రయోజనం నెరవేరుతుందని వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్స న్ పి.సునీతామహేందర్రెడ్డి తెలిపారు. ఆదివా రం వికారాబాద్ పట్టణంలోని మద్గుల్చిట్టంపల్లి డీపీఆర్సీ భవన్లో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్బంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకోవడం చాలా గొప్ప విష యమన్నారు. పాఠశాలలో సమస్యలు ఉన్నట్లెతే తమ దృష్టికి తీసుకరావాలని, తన వంతు సహకారంగా జడ్పీ నుంచి నిధు లు మంజూరు చేస్తానని హామి ఇచ్చారు.
దేశ భవిష్యత్ తరగతి గదిలోనే తీర్చిదిద్దుకోబడుతుందని, ఇందుకు ఉపాధ్యాయుల పాత్రే కీలకమన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడు తూ…మాతృదేవోభవ.. పితృ దేవోభవ.. ఆచా ర్య దేవోభవ.. అంటూ తల్లిదండ్రుల తరువాత మహోన్నత స్థానాన్ని గురువులకు ఇచ్చారన్నారు. భవిష్యత్లో ఏ స్థాయిలో ఉన్నా ఉపాధ్యాయులను గుర్తు చేసుకోవాలని, విద్య నేర్పిన గురువులను పూజించే గొప్ప సంస్కృతి మన దేశంలో ఉందని గుర్తు చేశారు. టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ జి.నాగేందర్గౌడ్ మాట్లాడుతూ విద్యార్థుల మానసిక స్థితి గతులను తెలుసుకొని విద్యాబుద్దులు చెప్పాలని వివరించారు.
అదనపు కలెక్టర్ చంద్రయ్య మాట్లాడుతూ ప్రభు త్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గతంలో కం టే ఈసారి 40 శాతం పెరిగిందని తెలిపారు. జిల్లా విద్యాధికారి రేణుకాదేవి మాట్లాడుతూ మర్పల్లి మండలం కోట్మర్పల్లి పాఠశాలలో కొంత మంది విద్యార్థులు ఆడియో ద్వారా కొత్త రకం పద్ధతిని తయారు చేయడంతో రాష్ట్రంలోనే మొదటి స్థానంగా నిలిచి జాతీయ అవార్డు సొం తం చేసుకుందన్నారు. అనంతరం జిల్లా నుంచి ఎంపికైన 32 మంది ఉపాధ్యాయులను సన్మా నం చేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ మం జుల, ఎంపీపీ చంద్రకళ, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శంషాద్బేగం పాల్గొన్నారు.