కొందుర్గు : కొందుర్గు, జిల్లెడు దరిగూడ మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు ఉత్తమ అవార్డులు అందుకున్నారు. కొందుర్గు మండలంలోని పల్లప్పగూడ ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న శ్రీధర్రెడ్డి, ముట్పూర్ పాఠశాలలో పని చేస్తున్న కూర్మారావు, జిల్లెడు దరిగూడ మండలంలోని ఇంద్రానగర్ పాఠశాలలో పని చేస్తున్న నర్సింహులు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైనట్లు ఎంఈఓ కిష్టారెడ్డి తెలిపారు. ఆదివారం ఉత్తమ ఉపాధ్యాయులకు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను మండల వాసులు అభినందించారు.