డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో దీన్దయాల్
ఆమనగల్లు, ఏప్రిల్10: కరోనా వ్యాక్సిన్ సురక్షితంగా పనిచేస్తుందని ప్రతీ ఒక్కరూ ముందుకు వచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలని వైద్యాధికారులు కోరారు. శనివారం ఆమనగల్లు ప్రభుత్వ దవాఖాన ఆవరణలో, మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మొత్తం 98 మంది వ్యాక్సిన్ తీసుకొన్నారు. ఆమనగల్లు పట్టణంతో పాటుగా మండ లంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వ్యాక్సిన్ తీసుకొన్నారు. మున్సి పల్ కార్యాలయం ఆవరణలో సిబ్బందితో పాటు గా అధికారులు వ్యాక్సిన్ ను తీసుకొన్నారు. గత వారం రోజులుగా మండలంలో వ్యాక్సినేషన్ కు మంచి స్పందన వస్తుందని కందుకూర్ డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో దీన్దయాల్ పేర్కొన్నారు.ప్రజలంతా సామాజిక బాధ్యతగా మా స్కును ధరించాలని కోరారు. లక్షణాలు ఉంటే తప్పనిసరిగా ప్రభుత్వ దవాఖాన కు వెళ్లి కరోనా టెస్టులను చేయించుకోవాలని కోరారు. కరోనా నిర్ధారణ అయిన వారితో పాటు గా బాధిత కుటుంబ సభ్యులు తప్పనిసరిగా హోంఐసోలేషన్లో నిబంధనల ప్రకారం ఉండాలని కోరారు. ఆమనగల్లు మండ ల కేంద్రంలో 10 మందికి కరోనా నిర్ధారణ అయిందన్నారు.
33 మందికి పరీక్షలు : అందరికీ నెగిటివ్
మాడ్గుల: మండలంలో కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం కొన సాగుతున్నది. శనివారం ప్రభుత్వ దవాఖాన ఆవరణలో ప్రజాప్రతినిధులు వ్యాక్సిన్ తీసుకొన్నారు. మండలంలోని ప్రాథమిక వైద్య కేంద్రాల్లో ప్రభుత్వ సూచనల ప్రకారం కరో నా టెస్టులు, వ్యాక్సినేషన్ కార్యక్ర మాలను కొన సాగిస్తున్నట్లు వైద్యాధికారి లలిత పేర్కొ న్నారు. మండల కేంద్రంలో 33 మందికి పరీక్షలు చేయ గా అందరికి నెగిటివ్ వచ్చిందన్నారు.