హైదరాబాద్: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) టెక్నికల్ విభాగంలో డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 28 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. గేట్-2021 స్కోరు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
మొత్తం పోస్టులు: 41
అర్హత: సివిల్ ఇంజినీరింగ్లో బీటెక్ లేదా బీఈ చేసి ఉండాలి. అభ్యర్థులు 30 ఏండ్లలోపువారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: గేట్-2021 స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: మే 28
వెబ్సైట్: nhai.gov.in
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..