కడ్తాల్ : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మాడ్గుల్ మండలం దొడ్లపహాడ్ గ్రామానికి చెందిన శోభకి రూ. 60వేలు, వెల్దండ మండలం కుందారం తండాకి చెందిన పవన్కి రూ. 36వేలు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సహకరంతో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు మంజూరయ్యాయి. గురువారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి టీఆర్ఎస్ సర్కార్ పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు. సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకందరికీ వరంలా మారిందని, ఈ పథకం ఎంతోమంది పేదల జీవితాల్లో వెలుగులు నింపిదని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు సురేందర్రెడ్డి, యాదయ్య పాల్గొన్నారు.