షాద్నగర్ : రోగులకు మెరుగైన సేవలను అందించాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శుక్రవారం షాద్నగర్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రైవేట్ దవాఖానను ప్రారంభించారు. నేటి ఆధునిక సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. కరోనా, డెంగీ, చికున్ గున్యా, టైఫాయిడ్ వంటి వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ప్రైవేట్ వైద్యులు పేద ప్రజల పక్షాన నిలువాలని, తక్కువ ఖర్చులో నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాతూరి వెంకట్రావు, మన్నె నారాయణ, స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.