కడ్తాల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమానికి, అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతను కల్పిస్తూ, పథకాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని ఏక్వాయిపల్లి గ్రామంలో ఎంపీపీ కమ్లీమోత్యానాయక్తో కలిసి ఎమ్మెల్సీ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామంలో కొవిడ్ బారిన పడి కోలుకున్న వారికి సీఎంఎస్ సంస్థ సమాకూర్చిన నిత్యావసరాల సరుకులను ఎమ్మెల్సీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ రాష్ట్రంలోని సబ్బండ వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. కొవిడ్-19 నియంత్రణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకున్నాదన్నారు.
ఏక్వాయిపల్లి గ్రామ అభివృద్ధికి నిధులు కేటాయించాలని గ్రామ సర్పంచ్ సుగుణ ఎమ్మెల్సీకి, ఎంపీపీకి వినతిపత్రాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్సీ, ఎంపీపీని స్థానిక ప్రజాప్రతినిధులు శాలువాలతో సన్మానించారు. అనంతరం ఇటీవల మృతి చెందిన మాజీ ఎంపీపీ బుగ్గయ్య కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ పరామర్శించారు. కార్యక్రమంలో సర్పంచ్ సుగుణ, ఎంపీటీసీ నిర్మల, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ వీరయ్య, ఉప సర్పంచ్ ముత్యాలు, నాయకులు సురేందర్రెడ్డి, హన్మానాయక్, భాస్కర్రెడ్డి, యాదగిరిరెడ్డి, కాశీనాథ్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, సాయిలు, శేఖర్గౌడ్, సుమన్, రవికాంత్గౌడ్, చంద్రకాంత్, మల్లేశ్, యాదయ్యగౌడ్ పాల్గొన్నారు.