పరిగి : పరిగి పట్టణంలో సీఆర్పీఎఫ్ బలగాలతో పోలీసు కవాతు నిర్వహించారు. శనివారం పట్టణంలోని పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన కవాతు తాసిల్దార్ కార్యాలయం రోడ్డు, బస్టాండ్, బహార్పేట్, కొడంగల్ క్రాస్ రోడ్డు, పాత పరిగి వరకు కొనసాగింది. వినాయక ఉత్సవాలను పురస్కరించుకొని పట్టణంలో పోలీసులు కవాతు నిర్వహించామిని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ శాంతియుతంగా పండుగలు జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐ పాటిల్ క్రాంతికుమార్ పాల్గొన్నారు.