కేశంపేట : మండల కేంద్రంలో పోచమ్మ తల్లికి గురువారం ప్రజలు భక్తిశ్రద్ధలతో బోనాల పండుగను నిర్వహించారు. మహిళలు బోనాలను డప్పు వాయిద్యాల మధ్య బొడ్రాయికి ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం పోచమ్మకు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. బోనాలను చూసేందుకు ప్రజలు తరలివచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకట్రెడ్డి, ఎంపీటీసీ యాదయ్యచారి, గ్రామ ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.