ధారూరు : హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను సంరక్షించాలని డీఆర్డీవో పీడీ కృష్ణన్ అన్నారు. మంగళవారం ధారూరు మండల కేంద్రంలోని పల్లెప్రకృతి వనం, గ్రామ నర్సరీలను, హరిత హారం కార్యక్రమంలో నాటిన మొక్కలను పరీశీలించారు. పల్లె ప్రకృతి వనంలోని మొక్కలను, నర్సరీలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీఆర్డీవో మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను సంరక్షించుకోవాలని, రోడ్లకు ఇరువైపుల నాటిన మొక్కలకు ట్రీగార్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. కిలో మీటరుకు 1332 మొక్కలు, మండలానికి 10.5 కిలోమీటర్లు మెరా మొక్కలు నాటేందుకు సిద్ధం చేసినట్లు తెలిపారు. 10.5 కి.మీటర్లకు 14వేలు మొక్కలు నాటేందుకు ప్రణాళిక తయారు చేశామని ఎంపీడీవో తెలిపారు. వీరి వెంట ధారూరు ఎంపీడీవో ఉమాదేవి, గ్రామ సర్పంచ్ చంద్రమౌళి, ఉపాధి హామీ సిబ్బంది, కూలీలు ఉన్నారు.