పెద్దేముల్ : గులాబ్ తుఫాన్ వల్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ నిఖిల కోరారు. మంగళవారం మండల పరిధిలోని మన్సాన్పల్లి వాగును జిల్లా అడినషల్ కలెక్టర్ చంద్రయ్య, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నందున ప్రజలను దగ్గరకి రానియకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేయాలని అన్నారు. రాత్రిపూట అధికారులు అందరూ అనుక్షణం అప్రమత్తంగా ఉండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూడాలని ఆదేశించారు.
ప్రస్తుత పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలని స్థానిక అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య, ఎంపీడీఓ లక్ష్మప్ప, ఇతర అధికారులు ఉన్నారు.