తలకొండపల్లి : రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. తలకొండపల్లి మండలంలోని రాంపూర్, జంగారెడ్డిపల్లి, మెదక్పల్లి గ్రామాల్లో శనివారం ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎంపీ రాములు, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, గోరెటి వెంకన్నతో కలిసి పల్లెప్రకృతి వనాలతో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
ఏస్సీ కాలనీలు, ఎస్టీ తండాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నరని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ వెంకటేశ్, ఎంపీపీ నిర్మల, సర్పంచ్లు ధరణి శివశంకర్రెడ్డి, వరలక్ష్మీరాజేందదర్రెడ్డి, శ్యాంసుందర్రెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షడు దశరథ్నాయక్, జడ్పీకో-ఆప్షన్ సభ్యుడు రహమాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ వరలక్ష్మీ సురేందర్రెడ్డి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.