చేవెళ్ల టౌన్ : నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. బుధవారం చేవెళ్ల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో నిర్వహించిన నవోదయ పరీక్షకు 332మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని, ఇందులో 168మంది విద్యార్థులు హాజర కాగా 164మంది గైర్హాజరు అయ్యారు. నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సెంటర్ను చేవెళ్ల మండల విద్యాధికారి సయ్యద్ అక్బర్ తనిఖీ చేశారు.